రజనీ చేరికతో అపోలో వద్ద హై టెన్షన్.. భారీ ఎత్తున పోలీసులు ?

-

హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రజనీకాంత్ ఆరోగ్య పరిస్ధితి ప్రస్తుతం నిలకడగా ఉంది.  సాయంత్రం డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. బీపీ సమస్య తప్ప మరొకటి లేదని అపోలో డాక్టర్లు చెబుతున్నారు. నిజానికి ఆయనకి విశ్రాంతి అవసరమని, ఎవరూ డిస్టర్బ్  చేయొద్దని సూచించారు. రజనీని కలిసేందుకు ఎవరూ రావద్దని చెబుతున్నారు. ఈరోజు ఉదయం 7 సమయంలో  కూతురు ఐశ్వర్య తో అపోలో హాస్పిటల్ కి వచ్చి చేరారు.

అపోలో హాస్పిటల్ ఇంటర్నేషనల్ మిలీనియం బ్లాక్ లోని సెకండ్ ఫ్లోర్ లో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. కోవిడ్ టెస్ట్ లో నెగటివ్ వచ్చినట్లు  విశ్వశనీయ సమాచారం , బిపి ఫ్లూక్టువషన్స్ వల్ల అబ్జర్వేషన్ లో ఉంచినట్టు తెలుస్తోంది. కట్టు దట్టమైన భద్రత మధ్య అపోలో హాస్పిటల్  ఉంది. భారీ ఎత్తున పోలీస్ ప్రొటెక్షన్ కూడా కోరినట్టు చెబుతున్నారు. ఇటీవలే సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చారు  రజనీ. అన్నాత్తె సినిమా యూనిట్ లోని ఆరుగురికి కరోనా పాజిటివ్ రావడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది.  రజనీ కూడా మూడ్రోజుల క్రితం కరోనా టెస్టులు చేయించుకోగా.., ఆయనకు నెగెటివ్ వచ్చింది. 

Read more RELATED
Recommended to you

Latest news