టీసీఎస్ ఘనత .. దేశంలోనే ఎక్కువ మంది ఉద్యోగులున్న కంపెనీగా రికార్డు..

-

టాటా గ్రూపుకి చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సరికొత్త రికార్డును సాధించింది. ఐటీ సేవలు అందించే ఈ సంస్థ, దేశంలోనే ఎక్కువ మంది ఉద్యోగులున్న కంపెనీగా రికార్డు క్రియేట్ చేసింది. ప్రస్తుతం జూన్ 30వ తేదీ వరకు చూసుకుంటే, 509,058మంది ఉద్యోగులు ఉన్నారు. కొత్తగా మొదటి త్రైమాసికంలో 20వేలకై పైగా ఉద్యోగులను తీసుకున్నారు. దీంతో ఉద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగింది. అందువల్ల దేశంలో ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్న కంపెనీగా రికార్డుకెక్కింది.

155దేశాల నుండి వివిధ విభాగాల్లో పనిచేస్తున్నవారు ఇక్కడ ఉన్నారు. మొత్తం ఉద్యోగుల్లో 36.2శాతం మహిళా ఉద్యోగులు ఉన్నారని టాటా గ్రూపు వెల్లడించింది. మొదటి త్రైమాసికంలో మొత్తం 478,000 మంది ఉద్యోగులు వివిధ రకాల శిక్షణల్లో ఉన్నారు. అందులోని 407,000 మంది ఉద్యోగులు వేరు వేరు కొత్త సాంకేతిక పరిజ్ఞాన శిక్షన కూడా తీసుకుంటున్నారు. మొత్తానికి ఎక్కువ మంది ఉద్యోగులు కలిగి ఉన్న కంపెనీగా టీసీఎస్ అరుదైన ఘనత సాధించింది. అలాగే ప్రపంచంలో ఎక్కువ మంది కంపెనీల్లో టీసీఎస్ రెండవ స్థానంలో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news