హిందూ మతంలో కుమారులు మాత్రమే ఎందుకు అంత్యక్రియలు చేస్తారు?

-

హిందూ మతంలో కొన్ని ప్రత్యేకమైన సంప్రదాయాలు ఉంటాయి. అందులో ఒకటి అంత్యక్రియలు చేసే బాధ్యత కుమారుడికి ఉండటం. ఇప్పుడంటే మహిళలు కూడా తల్లిదండ్రులకు అంత్యక్రియలు చేస్తున్నారు. కానీ ఒకప్పుడు కచ్చితంగా కుమారుడు మాత్రమే చేయాలని పట్టుబట్టేవారు. కొడుకులు లేనివారు వేరే ప్రత్యామ్నాయం గురించి ఆలోచించేవారు. అయితే కొడుకులు మాత్రమే అంత్యక్రియలు చేయాలనే నియమం వెనక చాలా కారణాలు ఉన్నాయి.
నిజానికి హిందూ మతంలో అంత్యక్రియలకు సంబంధించి అనేక నియమాలు ఉన్నాయి. హిందూ సంప్రదాయం ప్రకారం కుటుంబంలో ఎవరైనా చనిపోతే కుటుంబానికి చెందిన కుమారుడు మాత్రమే అంత్యక్రియలు నిర్వహించాలని చెబుతారు. మహిళలు అంత్యక్రియలు నిర్వహించడం అంటేనే కాస్త ఆలోచనల్లో పడతారు. దీనికి గల కారణాన్ని ఇప్పుడు చూద్దాం..

శాస్త్రాలలో పేర్కొన్న సమాచారం ప్రకారం అంత్యక్రియల సమయంలో చేసే అన్ని కర్మలు కొడుకు చేత నిర్వహిస్తారు. కొడుకులు మాత్రమే ఎందుకు కుమార్తెలు చేయెుచ్చు కదా అని మీరు అడుగుతారేమో. దీనికి సమాధానం వేదాలలో కూడా ఉంది.

పుత్ర అనే పదం రెండు అక్షరాలతో ఉంటుంది. ‘పు’ అంటే నరకం, ‘ద్ర’ అంటే జీవితం. దీని ప్రకారం కొడుకు అంటే నరకం నుండి విముక్తి కలిగించేవాడు. అనగా తండ్రి లేదా తల్లిని నరకం నుండి ఉన్నత స్థానానికి తీసుకెళ్లేవాడు. అందుకే పుత్రుడు పున్నామ నరకం నుంచి తప్పిస్తాడనే సామెత కూడా ప్రచారంలో ఉంది.

 

ఇలాంటి కారణాలతో అంత్యక్రియల ఆచారాలను నిర్వహించడానికి కొడుకుకు హక్కులు ఉంటాయి. అదే సమయంలో, దీని వెనుక ఉన్న మరొక కారణం ఏమిటంటే స్త్రీ లక్ష్మీ స్వరూపం అయినట్టే, కొడుకు కూడా విష్ణువు అంశగా పరిగణిస్తారు.

ఇక్కడ విష్ణువు అంటే పోషణ అని అర్థం. అంటే కుటుంబ సభ్యులందరినీ చూసుకునే వ్యక్తి కొడుకు. ఇంటి పెద్ద దిక్కు మరణించిన తర్వాత అన్ని బాధ్యతలు అతడి మీదే ఉంటాయి. అయితే ఇప్పుడు మహిళలు కూడా ఈ బాధ్యతను తీసుకోగలుగుతున్నారు.

ఈ అంత్యక్రియల ఆచార నియమాలు మెుదలైనప్పుడు మహిళలు కుటుంబాన్ని చూసుకునే సామర్థ్యాన్ని కలిగి లేరని కొందరూ చెబుతారు. అందుకే ఇలాంటి ప్రత్యేక హక్కులు లేవు. కానీ నేటి కాలంలో ఆడపిల్లలు కూడా అంత్యక్రియలు చేస్తున్నారు. ఇంట్లో ఎవరైనా మరణించిన తర్వాత వారు ఇంటి బాధ్యతలు కూడా తీసుకుంటున్నారు. అయినప్పటికీ ఈ ఆచారం ఇప్పటికీ చాలా గృహాలలో ఉంది. అందుకే కుమారులు మాత్రమే అంత్యక్రియలు చేస్తుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news