అభిమాని చేసిన ఆ పనికి హృతిక్​ రోషన్​ సీరియస్!

-

తమ అభిమాన హీరోలు కనపడగానే ఫ్యాన్స్​కు ఎక్కడాలేని ఆనందం వచ్చి రకరకాల పనులు చేస్తుంటారు. అయితే తాజాగా ఓ అభిమాని చేసిన పనికి హీరో హృతిక్​ రోషన్​ చాలా సీరియస్​ అయ్యారు. అసలు ఏం జరిగిందంటే?

అభిమాన హీరోలు కనిపిస్తే చాలు.. అడ్డుగా ఉన్న సెక్యూరిటీని కూడా దాటుకుని వారితో సెల్ఫీలు తీసుకోవాలని ఆశపడుతుంటారు చాలా మంది అభిమానులు. కొన్నిసార్లు ఈ అత్యుత్సాహం వల్ల వారికే ప్రమాదం జరిగే అవకాశముంది. సదరు హీరోలకు కూడా దీని వల్ల అసౌకర్యం కలగవచ్చు. ఫలితంగా కొంతమంది ఓర్పు నశించి అభిమానులపై ఆగ్రహం వెళ్లగక్కిన, కొన్నిసార్లు ఫ్యాన్స్‌పై చేయి చేసుకున్న దాఖలాలు కూడా లేకపోలేదు. తాజాగా బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది.

శుక్రవారం హృతిక్ తన పిల్లలతో ‘బ్రహ్మాస్త్ర’ సినిమా చూడడానికి ముంబయిలోని ఓ మల్టీప్లెక్స్‌కు వెళ్లారు. అయితే సినిమా చూసి తిరిగి కారు వద్దకు వెళ్లే సమయంలో అకస్మాత్తుగా ఓ అభిమాని హృతిక్‌తో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఆవేశంగా అందర్నీ తోసుకుని రావడం వల్ల అసౌకర్యంగా ఫీలైన హీరో.. అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా అతడిని తిట్టేంత వరకు వెళ్లారు. ఈలోపు సెక్యూరిటీ సిబ్బంది అభిమానిని హృతిక్‌కు దూరంగా లాక్కెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రస్తుతం హృతిక్  సైఫ్ అలీఖాన్‌ తో కలిసి విక్రమ్ వేద సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ట్రైలర్‌ విడుదలై, సందడి చేస్తోంది. ఇందులో.. పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా సైఫ్‌, గ్యాంగ్‌స్టర్‌గా హృతిక్‌ కనిపించారు. ఇద్దరి నటన కట్టిపడేసేలా ఉంది. హృతిక్‌ రోషన్‌ లుక్‌ చాలా కొత్తగా ఉంది. యాక్షన్‌ సన్నివేశాలు, నేపథ్య సంగీతం ట్రైలర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మాతృకకు దీటుగా ఈ రీమేక్‌ చిత్రం తెరకెక్కిన్నట్టు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది

మాధవన్‌, విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్‌ హిట్‌ తమిళ చిత్రం ‘విక్రమ్‌ వేద’కు రీమేక్‌ ఇది. మాతృకను తెరకెక్కించిన పుష్కర్‌, గాయత్రి ద్వయమే ఈ హిందీ సినిమాకూ దర్శకత్వం వహించింది. ఎస్‌. శశికాంత్‌, భూషణ్‌ కుమార్‌ నిర్మించారు. రాధికా ఆప్టే కీలక పాత్ర పోషించారు. సెప్టెంబర్‌ 30న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news