భారత ఆటగాళ్లకు భారీ జరిమానా..!

-

ప్రస్తుతం అసలు పర్యటనలో ఉన్న భారత జట్టు ఇటీవలే ఆస్ట్రేలియా జట్టుతో వన్డే సిరీస్ మొదలుపెట్టింది అన్న విషయం తెలిసిందే అయితే మొదటి మ్యాచ్ లోనే కోహ్లీ సేన కు ఎదురు దెబ్బ తగిలింది. ఇక మొదటి వన్డే మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టుతో టీమిండియా ఓటమి చవిచూసింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం భారత అభిమానులు అందరూ నిరాశలో మునిగిపోయారు అయితే కోహ్లీ జట్టుకు ప్రస్తుతం ఓటమి తో పాటు మరో భారీ షాక్ తగిలింది.

ఆటగాళ్లందరూ ఫీజులో 20 శాతం కోత విధిస్తూ ఇటీవల ఐసీసీ నిర్ణయం తీసుకుంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. నిన్న జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా విధిస్తున్నట్లు ఐసీసీ తెలిపింది. ఇక ఈ విషయాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా అంగీకరించాడు అంటూ ఐసీసీ తెలిపింది. అయితే ఆస్ట్రేలియా ఆటగాళ్లు నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయడంతో ఎలాంటి జరిమానా పడలేదు.

Read more RELATED
Recommended to you

Latest news