ఇల్లు కట్టుకునే వారికి బిగ్ షాక్..భారీగా పెరిగిన సిమెంట్ ధరలు !

-

కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి బిగ్‌ షాక్‌ తగిలింది. మరోసారి సిమెంట్ ధరలు పెరిగే అవకాశం ఉందని ఎమ్ కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అభిప్రాయపడింది. బస్తాకు రూ. 10 నుంచి రూ. 15 వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఈ ఏడాది ఆగస్టు నెల నుంచి బస్తా సిమెంట్ కు రూ. 16 చొప్పున పెరిగింది. ప్రస్తుతానికి ఈ అంశం చర్చల దశలోనే ఉందని, కొద్ది రోజుల్లో దీనిపై కంపెనీలు ప్రకటన చేసే అవకాశం ఉందని ఎమ్ కే గ్లోబల్ వెల్లడించింది.

ఈ ఏడాది ఆగస్టు-సెప్టెంబర్‌ మధ్య కాలంలో సిమెంట్‌ బస్తా రేటు 16 రూపాయలు పెరిగింది. నవంబర్‌లో మరో ఆరేడు రూపాయలు పెంచారు. ఇప్పుడు మళ్లీ పెంచేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని ఎంకే గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ తెలిపింది. దేశంలోని పశ్చిమ మరియు మధ్య ప్రాంతాల్లో సిమెంట్‌ ధరలు ఫ్లాట్‌గా ఉండగా.. ఉత్తర, తూర్పు మరియు దక్షిణ ప్రాంతాల్లో కొంచెం హార్డ్‌గానే ఉన్నాయని వివరించింది.

Read more RELATED
Recommended to you

Latest news