పెళ్లి ఇంట భారీ చోరీ.. 200 తులాల బంగారం, ఎనిమిది లక్షల క్యాష్ !

-

పెళ్లి ఇంట్లో దొంగతనం జరగగా పెద్ద ఎత్తున బంగారం నగదు అపహరణకు గురయింది.  సుమారు 200 తులాల బంగారు ఆభరణాలు  రూ.8 లక్షల రూపాయల నగదు అపహరణకు గురయ్యాయని అంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం బోయిన్ పల్లిలో ఈ భారీ చోరీ జరగగా సుమారు 200 తులాల బంగారు ఆభరణాలు  ఎనిమిది లక్షల రూపాయల నగదు చోరీకి గురయ్యాయి.

బోయిన్ పల్లి గ్రామానికి చెందిన ఇంద్రారెడ్డి ఇంట్లో శుక్రవారం రాత్రి ముగ్గురు దొంగలు చొరబడి  కూతురి వివాహానికి కోసం తెచ్చిన నగలతో పాటుగా కుటుంబసభ్యుల ఆభరణాలు దొంగిలించారు.  ఇదంతా జరిగిన సమయంలో కుటుంబ సభ్యులు అందరూ ఇంట్లోనే నిదిరిస్తున్నారని అంటున్నారు. విషయం తెలుసుకున్న మిడ్జిల్ ఎస్సై సురేష్ బాబు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. అయితే ఈ చోరీ గురించి అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

 

Read more RELATED
Recommended to you

Latest news