వంట రుచి బాలేదని భార్యను చంపేసిన భర్త..!

-

బాచుపల్లి పీస్ పరిధిలో ఒక దారుణం చోటుచేసుకుంది భార్య చేసిన వంట రుచి బాలేదని తాళి కట్టిన భార్యని భర్త చంపేశాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చూసినట్లయితే ఉత్తరప్రదేశ్ బాలా ఘాట్ కి చెందిన రవిన దుర్వే నవీన దుర్వే భార్యాభర్తలు. 11 ఏళ్ళ క్రితం వీళ్ళకి పెళ్లయింది. వీళ్ళకి ముగ్గురు పిల్లలు. ఇద్దరు పిల్లలు ఉత్తరప్రదేశ్లో బంధువులు ఇంట్లో ఉంటున్నారు. ఏడాది బాబు వీళ్ళతో ఉంటున్నాడు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ప్రగతి నగర్ లోని ప్రగతి కన్స్ట్రక్షన్ లో లేబర్ గా పనిచేస్తున్నారు.

అయితే వంట విషయంలో సోమవారం రాత్రి వీళ్ళ మధ్య గొడవ జరిగింది భార్య రుచిగా వంట చేయలేదన్న కారణంతో భార్యతో నవీన్ గొడవపడి భార్యను ఇటుకురాయితో తల మీద గట్టిగా కొట్టాడు దీంతో ఆమె తీవ్ర గాయాలు పాలై చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టు మాత్రం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడు నవీన్ ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news