భార్యను టీజ్ చేశాడని… పగ తీర్చుకున్న భర్త.. ఏకంగా చంపేసి బూడిద చేశాడు.

-

ఇతరులకు విలువనివ్వకుండా ప్రవర్తించింది ఒకరైతే… ఆ ప్రవర్తనకు విసుగు చెంది హత్య చేసిన వారు మరొకరు. ఇలా తను ఎంతో ప్రాణంగా చూసుకుంటున్న భార్యను టీజ్ చేశాడని.. ఓ భర్త దారుణంగా ప్రవర్తించాడు. ఎన్నిసార్లు హెచ్చరించినా తీరు మార్చుకోకపోవడంతో.. చంపేసి మంటల్లో కాల్చి బూదడ చేశాడు సదరు భర్త. వివరాల్లోకి వెళితే ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం చిక్ బళ్లాపూర్ జిల్లా కంబాల హళ్లి అనే గ్రామంలో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే శంకర్ అనే వ్యక్తి తరుచూ.. అశోక్ భార్యను వేధించసాగాడు. అయితే అతని చాలాసార్లు హెచ్చరించినా తీరు మార్చుకోలేదు. ఓ వైపు హెచ్చరిస్తున్నా వేధింపులు కొనసాగిస్తూనే ఉన్నాడు శంకర్. అయితే భార్యను అదే పనిగా వేధింపులకు గురిచేస్తుండటంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు అశోక్. శంకర్ ను పదునైన ఆయుధంతో చంపేసి, రాత్రికి రాత్రే శవాన్ని కాల్చేసి బూడిద చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news