హైదరాబాద్ లో దారుణం..భార్యకు యాసిడ్‌ తాగించిన భర్త

-

హైదరాబాద్ లోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యకు యాసిడ్‌ తాగించాడు ఓ భర్త. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… ఆస్తుల కోసం సొంత భార్యను అంతమొందించటానికి కుట్ర చేశాడు సైదాబాద్‌ కు చెందిన ఇంజనీర్‌ అధికారి భర్త. భార్యకు యాసిడ్ తాపించి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.

విషయం బయటకి పొక్కకుండా నగ్నంగా గదిలో బంధించాడు ఆ దుర్మార్గుడు. అయితే..తన భర్త నుంచి తప్పించుకొని పారిపోయి వచ్చిన బాధితురాలు.. నేరుగా సైదాబాద్‌ పోలీసులను ఆశ్రయించింది. వివస్త్రను చేసి నిర్బంధం చేసిన తన భర్త నుండి ప్రాణహాని ఉందని.. పోలీసులను వేడుకుంది ఆ బాధిత మహిళ. అటాచ్డు ఆస్తుల కోసం తనను ప్రతి సారి వేధిస్తున్నాడని.. ఆ మహిళ ఆరోపణలు చేసింది. ఆ మహిళ వాదనలు విన్న సైదాబాద్ పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు. ఆమె భర్త కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news