హుజూర్‌న‌గ‌ర్ 8వ రౌండ్ రిజ‌ల్ట్‌…. సైదిరెడ్డి మెజార్టీ టార్గెట్ ఇదే

-

హుజూర్‌ నగర్‌లో భారీ ఆధిక్యం దిశగా టీఆర్ఎస్ దూసుకువెళుతోంది. రౌండ్ రౌండ్‌కు గులాబీ పార్టీ మెజార్టీ పెంచుకుంటూ పోతోంది. మూడోరౌండ్‌‌లో టీఆర్‌ఎస్‌కు 6,777 ఓట్ల ఆధిక్యం రాగా, నాలుగో రౌండ్‌ తర్వాత 9,356 ఓట్ల ఆధిక్యం లభించింది. ప్రత్యర్థులకు అందనంత దూరంలో దూసుకుపోతున్నారు. తాజాగా 8వ రౌండ్ ఫ‌లితం కూడా వెల్ల‌డైంది. 8 రౌండ్లు ముగిసే స‌రికి టీఆర్ఎస్‌కు ఏకంగా 17,400 ఓట్ల భారీ మెజార్టీ వ‌చ్చింది.

తాజా రౌండ్ ఫలితాలతో టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతున్నాయి. ఇక త‌న‌కు బంపర్‌ మెజార్టీ ఖాయమని టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ పథకాలు, టీఆర్‌ఎస్ ప్రభుత్వ విధానాలే గెలిపిస్తున్నాయని ఆయన అన్నారు. మొత్తంగా త‌న‌కు 50 వేల మెజార్టీ వ‌స్తుంద‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. మొత్తం 22 రౌండ్లు కౌంటింగ్ జ‌ర‌గ‌నుంది.

Read more RELATED
Recommended to you

Latest news