చంద్రబాబు, YSR వల్లే హైదరాబాద్ అభివృద్ధి : సీఎం రేవంత్ రెడ్డి

-

చంద్రబాబు, వైఎస్ఆర్ కృషి వల్లే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఔటర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, హైటెక్ సిటీ, గచ్చిబౌలి చౌరాస్తా అభివృద్ధిని చూస్తున్నామని పేర్కొన్నారు. ఈ రోజు రాష్ట్రానికి అత్యధిక ఆదాయం ఈ ప్రాంతం నుంచే వస్తోందని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

cm revanth
Hyderabad development is due to Chandrababu and YSR said CM Revanth Reddy

పీజేఆర్ ఫ్లై ఓవర్ ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. అత్యాధునిక హంగులతో మల్టీ లెవల్ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది. రూ. 182.72 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..నాగార్జున N కన్వెన్షన్ కూల్చేస్తే ఆయనే వచ్చి చెరువులో ఉన్న ఇంకో రెండు ఎకరాలు నన్ను కలిసి ఇచ్చేసి.. నగర అభివృద్ధిలో నేను ఒక హీరోగా ముందు ఉంటా అని చెప్పారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news