ఐపీఎల్ 11వ మ్యాచ్‌.. ఢిల్లీ టార్గెట్ 163..

-

అబుధాబిలో జ‌రుగుతున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 11వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌పై స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ 162 ప‌రుగులు చేసింది. మ్యాచ్‌లో ముందుగా ఢిల్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా హైద‌రాబాద్ బ్యాటింగ్ చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 162 ప‌రుగులు చేసింది.

hyderabad mad 162 runs against delhi in ipl 2020 11th match

హైద‌రాబాద్ బ్యాట్స్‌మెన్ల‌లో జానీ బెయిర్ స్టో 48 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో 53 ప‌రుగులు చేసి ఆక‌ట్టుకోగా, డేవిడ్ వార్న‌ర్ 33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 45 ప‌రుగులు చేశాడు. అలాగే కేన్ విలియ‌మ్స‌న్ 26 బంతుల్లో 5 ఫోర్ల‌తో 41 ప‌రుగులు చేశాడు. ఢిల్లీ బౌల‌ర్ల‌లో ర‌బాడా, అమిత్ మిశ్రాలు చెరో 2 వికెట్లు తీశారు.

Read more RELATED
Recommended to you

Latest news