Hyderabad : శారీ రన్ లో పాల్గొనడం గర్వకారణం: నారా బ్రాహ్మణి

-

హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో మహిళా సాధికారత సాధన లక్ష్యంగా నిన్న తనీరా శారీ రన్ నిర్వహించారు.తనైరా సంస్థ, బెంగళూరుకు చెందిన ప్రముఖ ఫిట్నెస్ కంపెనీ జేజే యాక్టివ్ సంయుక్తంగా హైదరాబాద్లో ‘శారీ రన్’ నిర్వహించాయి. మహిళలు చీరకట్టుతో ఈ పరుగులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని నారా బ్రాహ్మణి జెండా ఊపి ప్రారంభించారు. సుమారు 3000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.దీనిపై ఆమె ఎక్స్(ట్విట్టర్) లో స్పందించారు.

శారీ రన్ కార్యక్రమాన్ని తాను జెండా ఊపి ప్రారంభించడం సంతోషంగా ఉందని నారా బ్రాహ్మణి తెలిపారు. ‘ధగధగ మెరిసిపోయే, కళాత్మకంగా నేసిన ముచ్చటైన చీరల్లో వందలాది మహిళలను చూడటం ఎంతో బాగుంది అని అన్నారు. చేనేతకు ప్రఖ్యాతిగాంచిన మంగళగిరిలో శ్రమ, ప్రేమ కలగలిపి అక్కడి మహిళలు అల్లిన చేనేత చీరను ధరించి నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో గర్వకారణం’ అని నారా బ్రాహ్మణి ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news