హైదరాబాద్ టూ ఊటీ.. ఫ్లైట్ లో వెళ్లి వచ్చేయచ్చు.. ధర కూడా తక్కువే..!

-

మంచి టూర్ వెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే ఊటీకి వెళ్లి వచ్చేయచ్చు. సరికొత్త టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఈ ప్యాకేజీ తో తక్కువ ధరలోనే ఊటీ వెళ్లి వచ్చేయచ్చు. సరికొత్త ఆఫర్స్ ఎప్పటికప్పుడు ఐఆర్‌సీటీసీ టూరిజం తీసుకు వస్తూనే వుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి తమిళనాడు లోని పలు ప్రాంతాలను చూసేందుకు ఓ టూర్ ప్యాకేజీని తీసుకు రావడం జరిగింది. అల్టిమేట్ ఊటీ ఎక్స్ హైదరాబాద్ పేరు తో ఈ ప్యాకేజీ ని తీసుకు రావడం జరిగింది.

ఊటీ, కున్నూర్ వంటివి కవర్ అవుతాయి. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ టూర్ జనవరి 25, 2024వ తేదీన ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఊటీ, కున్నూర్ వంటి పర్యాటక ప్రాంతాలు ఇందులో కవర్ అవుతాయి. ఇక ఈ ప్యాకేజీ ఎలా సాగుతుందో చూద్దాం.. మొదటి రోజు ఉదయం హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయం లో ఫ్లైట్ ఎక్కాలి. హోటల్ లోకి చెకిన్ అయ్యాక ఆదియోగి విగ్రహాన్ని చూడడానికి వెళ్ళాలి. రాత్రి ఊటీలోనే స్టే చేయాలి.

మూడో రోజు దొడబెట్ట పీక్, టీ మ్యూజియం ని చూడవచ్చు. నాలుగో రోజు కూనూర్ సైట్ సీయింగ్ కి వెళ్ళాలి. రాత్రికి ఊటీలోనే స్తే చేయాలి. మూడో రోజు దొడబెట్ట పీక్, టీ మ్యూజియం తో పాటుగా పైకారా ఫాల్స్ కి వెళ్ళచ్చు. రాత్రికి ఊటీలో స్టే చేయాలి. నాలుగో రోజు కూనూర్ సైట్ సీయింగ్ కి తీసుకెళ్తారు. రాత్రికి ఊటీలోనే ఉండాలి. అలానే పైకారా జలపాతం, సినిమా షూటింగ్ పాయింట్ ఇవన్నీ కూడా ఇందులోనే కవర్ అవుతాయి. ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.24850, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.25450గా ఉంది. అధికారిక వెబ్ సైట్ లో పూర్తి వివరాలు చూడవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news