సద్దాం తో గొడవ పై స్పందించిన హైపర్ ఆది..!!

-

తెలుగు ప్రజలకు టెలివిజన్ లో ఎంతో దగ్గర అయిన షోలు జబర్దస్త్ మరియు  ఎక్స్ట్రా జబర్దస్త్. ఇప్పటి వరకు వీటి రేటింగ్స్ ను కొట్టే షో లు రాలేదంటే వీటిని స్టామినా అర్దం చేసుకోవచ్చు. అంతలా ఈ షోస్ తెలుగు ప్రజలను అలరిస్తూ వస్తున్నాయి. ఈ షో ద్వారా చాలా మంది కమెడియన్స్ ఇటు టీవీ కి మరియు సినిమాకు పరిచయమయ్యారు. ఈ షో క్రేజ్ తో పటాస్, శ్రీ దేవి డ్రామా కంపెనీ వంటి షోస్ కూడా మల్లెమాల స్టార్ట్ చేసింది.

ప్రస్తుతం ఈటివి షోస్ లో ఆది యొక్క క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తన పంచ్ డైలాగులతో ప్రేక్షకులను పగలబడి నవ్వేలా చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం జబర్ధస్త్ మాత్రమే కాకుండా.. శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షోలలో తన పంచ్ కామెడీ డైలాగ్స్ తో స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నారు ఆది. ఇక పటాస్ షోతో పేరు సంపాదించుకున్న మరో కమెడియన్ సద్దాం. ఆ తర్వాత జబర్దస్థ్ షోలో పలు స్కిట్స్ చేసిన సద్ధాం వేరే ఛానెల్ షో కు వెళ్ళిపోయాడు. అప్పుడు ఆది కి సద్దాం కు విభేదాలు వచ్చాయని అందుకే అతను ఈటివి ని వదిలి పెట్టాడని వార్తలు వచ్చాయి.

అయితే ఇటీవల సద్ధాం తిరిగి జబర్ధస్త్ లో అడుగు పెట్టాడు. సూపర్ సద్ధాం.. యాదమ్మ రాజు టీమ్ పేరుతో స్కిట్లు మళ్లీ మొదలు పెట్టారు. ఈటీవి వారుడిసెంబర్ 31వ తేదీ రాత్రి ప్రసారం చేయడానికి 2023 న్యూ ఇయర్ స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేశారు మేకర్స్. ఇందుకు సంబంధించిన ప్రమోలో అందులో సద్ధాంతో మనస్పర్థలపై 2022లో నాకు సద్ధాంకు చిన్న చిన్న మనస్పర్థలు వచ్చాయి. ఈ 2023లో అవి కంప్లీట్ గా పోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అంటూ కేక్ కట్ చేసి సద్ధాంకు పెట్టాడు. వీరి మధ్య గొడవ ఎందుకు వచ్చింది అనేది ఫుల్ ఎపిసోడ్ లో తెలవనుంది.

Read more RELATED
Recommended to you

Latest news