నేను హిందువునే…. కాని ఆయన నాస్తికుడు : బండి సంజయ్

-

బీఆర్ఎస్ నేతలకు సిగ్గులేదని.. ఇక వాళ్లు మారరని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు.శనివారం ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ తో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ స్వయం ప్రకటిత మేధావి అని ఎద్దేవ చేశారు. ”నేను హిందువునేనని.. హిందు ధర్మ గురించే చెప్తాను. వినోద్ కుమార్ దేవుణ్ణి నమ్మరు..నాస్తికుడు” అని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ నేతలకు కళ్లు కనబడటం లేదని,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దోచి పెట్టడానికే వినోద్ గతంలో ఎంపీ అయ్యారని విమర్శించారు. మేడిగడ్డ ప్రాజెక్టు కూలిపోడానికి కారణం ఎవరని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరంలో వినోద్ కుటుంబ సభ్యులు, కాంట్రాక్టర్లు కాదా అని నిలదీశారు. వినోద్ ఎంపీగా ఉండి కరీంనగర్‌కు ఏం చేశాడో చెప్పాలని ప్రశ్నించారు. వినోద్‌ది కరీంనగర్ కాదని… తనది మాత్రం పక్కా లోకల్ అని ఎంపి బండి సంజయ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news