నేను లోకల్…ఈ స్టేడియం నాకెంతో స్పెషల్ : రవిచంద్రన్ అశ్విన్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ , రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి.చెపాక్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభ కానుంది.ఈ క్రమంలో తన సొంత మైదానం అయినటువంటి చెపాక్‌లో ఆడుతుండటంపై రాజస్థాన్‌ రవిచంద్రన్ అశ్విన్‌ థ్రిల్‌గా ఫీలవుతున్నాడు. ఈసారి తమ జట్టుకే ఇక్కడి ప్రేక్షకులు మద్దతు తెలుపుతారని అన్నారు.

”ఎవరి హోం గ్రౌండ్‌ వారికి స్పెషల్. నాకు కూడా చెపాక్‌ ఇలాంటిదే. చాలా సంవత్సరాల పాటు ఎన్నో సాధించిన మైదానం అది. బ్యాటింగ్ లోను ఇక్కడ నేను చాలా వరకు ప్రదర్శనను ఇచ్చాను. అలాగే ఈసారి కూడా మంచి ప్రదర్శనను ఇస్తానని నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని అన్నారు. ఈసారి మాకే మద్దతు ఇస్తారనుకుంటున్నా. హైదరాబాద్‌పై ఎలాంటి గేమ్‌ ప్లాన్‌ను అమలుచేస్తామనేది ఇప్పుడే చెప్పలేం. మా వ్యూహాలు వారిపై ఆధిపత్యం ప్రదర్శిస్తాయా? లేదా? అనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది” అని అశ్విన్‌ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news