ఆ సమయం కోసం ప్రతి ఏడాది ఎదురు చూస్తుంటా.. రేణు దేశాయ్ పోస్ట్.!

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య .. ప్రముఖ సీనియర్ హీరోయిన్ రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. తన పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా అభిమానులతో పంచుకునే ఈమె తాజాగా కొత్త సంవత్సరం సందర్భంగా తన కుమార్తె ఆధ్యా తో కలిసి కాశ్మీర్ కొండల్లో విహరించింది. ఎప్పటికప్పుడు తన పిల్లలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే రేణు దేశాయ్ తన పిల్లలతో తరచూ వెకేషన్ కి వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది . ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీ వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు.

ప్రస్తుతం రేణు దేశాయ్ ఢిల్లీ వెకేషన్ కి సంబంధించిన వీడియోలను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ వీడియోలో రేణు దేశాయ్ పచ్చిబఠానీలు తింటూ ఉండగా ఆ వీడియోని తీసినట్టు తెలుస్తోంది. పచ్చి బఠానీలు అంటే చాలా ఇష్టం అని, ప్రతి ఏడాది డిసెంబర్ కోసం తాను ఎంతో ఎదురు చూస్తూ ఉంటానని చెప్పుకొచ్చింది . కారణం డిసెంబర్ నెలలోనే బఠానీ పంట చేతికి వస్తుంది కాబట్టి అవి తినడానికి చాలా రుచికరంగా ఉంటాయని..వాటిని ఎన్ని పెట్టినా తాను తినేస్తానని అంటూ చెబుతూనే అవి అయిపోగానే తను చాలా బాధపడతాను అంటూ కూడా వీడియో ద్వారా రేణు దేశాయ్ తెలిపింది.

మొత్తానికి అయితే రేణు దేశాయ్ ఇలా పచ్చి బఠానీలు తింటూ ఉండగా ఆ వీడియో తీయడానికి చివరికి ఆధ్యా కూడా కెమెరామెన్ గా మారిపోయింది అయి సెటైర్లు కూడా వేస్తున్నారు కొంతమందిని నెటిజన్స్. ప్రస్తుతం ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by renu desai (@renuudesai)

Read more RELATED
Recommended to you

Latest news