విద్యార్ధులకు నేను సాయం చేస్తా: మరో నిర్ణయం తీసుకున్న సోను సూద్

-

ఈ కరోనా విపత్కర సమయంలో ప్రజలకు తన వంతుగా సహాయం చేస్తున్న నటుడు సోను సూద్ మరోసారి విద్యార్ధులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు. దేశంలో ఒకవేళ జేఈఈ, నీట్ పరీక్ష జరిగితే… బీహార్, అస్సాం & గుజరాత్ వరద బాధిత ప్రాంతాల్లో ఉంటూ ఇబ్బందులు పడే విద్యార్థులందరి ప్రయాణ ప్రాంతాలను నాకు తెలియజేయండని ఒక ట్వీట్ చేసారు ఆయన.

sonu
sonu

మిమ్మల్ని పరీక్షా కేంద్రాలకు చేర్చడానికి మీ ప్రయాణ ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నిస్తున్నా అని పేర్కొన్నారు. పరిక్షలు ఎవరూ కోల్పోవద్దు అని చెప్పాడు. ఇండియా టూడే కి చెందిన ఒక వ్యక్తి వీడియోని షేర్ చేసారు. రుణాలు లేవు రేషన్ లేదు, పరీక్షా కేంద్రం వద్దకు గంటల ప్రయాణం, ప్రైవేట్ కార్ ఛార్జీలు భరించలేము.. తండ్రి ఒక్కరే ఏకైక సంపాదన, కోవిడ్ రిస్క్ ఎక్కువ… అందుకే ఒక విద్యార్థి జెఇఇ, నీట్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారని వీడియోలో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news