మహిళపై కలెక్టర్ అత్యాచారం…ఏకంగా ఆఫీసులోనే..!

-

 

అధికారమదంతో రెచ్చిపోయిన ఓ ఐఏఎస్ అధికారి కలెక్టరేట్‌లోనే ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో పెను సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే.. జంగజీర్ చాంఫ్ జిల్లా కలెక్టరుగా పనిచేసిన జనక్ ప్రసాద్ పాథక్ మే 15వ తేదీన కలెక్టరు కార్యాలయంలోనే తనపై అత్యాచారం చేశారని 33 ఏళ్ల మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన తన భర్తను డిస్మిస్ చేస్తానని బెదిరించి తనను కలెక్టరేట్‌కు పిలిపంచి తనపై కలెక్టరు అత్యాచారం చేశాడని ఆ మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అలాగే ఆయన్నుంచి తనకు అశ్లీల సందేశాలు కూడా వచ్చాయని తెలిపింది. దీనిపై స్పందించిన జిల్లా ఎస్పీ పారుల్ మాథుర్, కలెక్టర్ పై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నామని తెలిపారు. ఆయనపై ఐపీసీ 376, 506, 509బి కింద కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు ఎస్పీ పారుల్ మాధూర్ చెప్పారు. కాగా, మహిళపై అత్యాచారం చేసిన కలెక్టరుపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. జిల్లా కలెక్టర్ బాధ్యతల నుంచి తప్పించి, రాష్ట్ర ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టరుగా సర్కారు బదిలీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news