Shubman Gill : చరిత్ర సృష్టించిన గిల్

-

Shubman Gill :  టీమిండియా స్టార్ క్రికెటర్ శుబ్ మన్ గిల్ చరిత్ర సృషించాడు.  టీమిండియా స్టార్ క్రికెటర్ శుబ్ మన్ గిల్ ప్రతిష్టాత్మక ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును గెలుచుకున్నాడు. 2023 సెప్టెంబర్ నెలలో అత్యుత్తమ ప్రదర్శనకుగాను గిల్ కు ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డు గెలవడం ద్వారా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు రెండుసార్లు దక్కించుకున్న తొలి భారత క్రికెటర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు.

Shubman Gill hospitalized in Chennai as platelet count drops, Reports
Shubman Gill hospitalized in Chennai as platelet count drops, Reports

ఈ ఏడాది జనవరిలో గిల్ తొలిసారి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు దక్కించుకున్నాడు. ఈ అవార్డును గిల్ ఒకే ఏడాది రెండుసార్లు సాధించడం విశేషం. కాగా, ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును అత్యధిక సార్లు దక్కించుకున్న ఘనత పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ కు దక్కుతుంది. బాబర్ ఇప్పటివరకు ఈ అవార్డును మూడుసార్లు గెలుచుకున్నాడు. బాబర్ తర్వాత ఇద్దరు ఆటగాళ్లు రెండు రెండు సార్లు ఈ అవార్డును దక్కించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news