విమానంలో ప్రయాణికురాలికి అస్వస్థత.. గన్నవరంలో అత్యవర ల్యాండింగ్

-

కృష్ణా: విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఇండిగో విమానం గన్నవరంలో అత్యవసర ల్యాండింగ్ అయింది.ఈ విమానం బెంగళూరు నుంచి పశ్చిమబంగా శిలుగురి వెళ్తోంది. బెంగుళూరు నుంచి బాగ్ డోగ్ర విమానాశ్రయానికి చేరుకోవాల్సిన ప్రయాణికురాలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడ్డారు. దీన్ని గమనించిన ఇండిగో సిబ్బంది విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయించారు. అనంతరం విమానాశ్రయ అంబులెన్స్ సాయంతో ఆమెను విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమెతో ప్రయాణించిన ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఆమెకు కరోనా ఉండచ్చేమోనని భయాందోళన చెందుతున్నారు. ఈ ఘటనతో విమానం ఆలస్యంగా బయలుదేరే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news