బీఆర్ఎస్ ఆ రెండు ఎంపీ సీట్లు గెలిస్తే.. మంత్రి పదవీకి రాజీనామా చేస్తా : మంత్రి కోమటిరెడ్డి

-

తెలంగాణలో ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావాలని భావిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల నామినేషన్లు రేపటితో ముగియనున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రోజు రోజుకు ప్రచారం జోరుగా ఊపు అందుకుంటుంది.

 

తాజాగా నల్గొండలోని క్లాక్ టవర్ సెంటర్ లో జరిగిన రోడ్డు షో లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ రెండు ఎంపీ సీట్లు గెలిస్తే.. తన మంత్రి పదవీకి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. కేసీఆర్ దమ్ముంటే తన సవాల్ ని స్వీకరించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని.. ఒక కారు షెడ్డుకేనని పేర్కొన్నారు. పెండింగ్ ప్రాజెక్ట్ పూర్తి చేయకుండానే నల్గొండ జిల్లాకు వస్తున్న కేసీఆర్ కి సిగ్గు ఉండాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నల్గొండ పార్లమెంట్ లో మనకు పోటీ ఎవ్వరూ లేరని.. ఇప్పటికే గెలుపు ఖాయం అయిందని.. మెజార్టీ కోసమే మనమంతా పని చేయాలని సూచించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news