అందరూ టికెట్ రేట్లు పెంచుతుంటే.. రవితేజ మాత్రం ….

-

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మాస్ మహా రాజా రవితేజ హీరోగా నటిస్తున్నటువంటి తాజా చిత్రం ఈగల్. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తుంది. కావ్య థాపర్ ,మధుబాల ,నవదీప్, అవసరాల శ్రీనివాస్ తదితరులు కీలకపాత్రలో నటిస్తున్నారు. వచ్చే నెల ఫిబ్రవరి 9న ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇటీవల బడ సినిమాల కి చెందిన నిర్మాతలు 300 – 400 రూపాయల వరకు కూడా టికెట్ రేట్లు పెంచుతున్నారు. దీంతో కొంతమంది ఆ రేట్లు చూసి మూవీకి వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తున్నారు.

కానీ ఈ చిత్ర నిర్మాతలు టికెట్ రేట్లు పెంచకపోవడం గమనార్హం.ఈ సినిమాకి సింగిల్ స్క్రీన్స్‌లో నేల టికెట్ రూ. 50 రూపాయల ఉండగా బాల్కనీ రూ.110 రూపాయల వరకే ఉంది. కొన్ని స్క్రీన్స్‌లో రూ.150 రూపాయలు ఉంది. ఇక మల్టీప్లెక్స్ లలో చాలావరకు రూ. 150, రూ. 200 రూపాయలే ఉండటం విశేషం. దీంతో సినిమా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news