జగన్ కట్టింది ప్యాలెస్ అయితే….చంద్రబాబు నివసించేది రాజమహల్ అందామా..? : పేర్ని నాని

-

ఆంధ్ర ప్రదేశ్ లో గత ప్రభుత్వం రిషికొండపై కట్టిన భవనాల గురించి వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన నివాసం కోసం 500కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఆ భవనాలు నిర్మించారని కూటమి శ్రేణులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.ఆ భవనాలు రాష్ట్రపతి, ప్రధాని వంటి విశిష్ట అతిధులు రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆతిధ్యం ఇవ్వటం కోసం కట్టిన భవనాలని, ప్రభుత్వ వినియోగం కోసం మాత్రమే ఉద్దేశించి కట్టిన భవనాలని వైసీపీ తెలిపింది.ఈ క్రమంలో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కూటమి ప్రభుత్వానికికూటమి ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చారు.

చంద్రబాబు నాయుడు ఇంటిని మీడియాని తీసుకెళ్లి హోమ్ టూర్ చేయించాలని, జగన్ ఇంటిని కూడా హోమ్ టూర్ చేయించి రిటైర్డ్ జడ్జితో ఎంక్వైరీ చేయించి తప్పు ఎవరిదో తేల్చాలని ఆయన అన్నారు. వైఎస్ జగన్ కట్టింది ప్యాలెస్ అయితే, హైదరాబాద్ లో చంద్రబాబు నివసించేది రాజమహల్ అందామా అని పేర్ని నాని ప్రశ్నించారు. ఫర్నిచర్ విషయంలో కూడా అనవసరంగా వైఎస్ జగన్ పై బురద చల్లుతున్నారని, వాటి విలువ ఎంతో చెబితే తక్షణమే చెల్లిస్తామని లేదా ప్రభుత్వానికి అప్పచెప్పటానికి కూడా సిద్ధమని పేర్ని నాని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news