సీఎం క్యాంపు ఆఫీస్ కి కే.ఏ.పాల్.. అపాయింట్ మెంట్ ఇస్తే దీవిస్తా.. లేదంటే శపిస్తా..!

-

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్ ఏది చేసినా కాస్త వెరైటీగానే ఉంటుంది. అది కాస్త వైరల్ గా మారిపోతుంది. ఇప్పుడు ఆయన సీఎం వై.ఎస్ జగన్ ని కలిసేందుకు చేస్తున్న ప్రయత్నం నవ్వులను పూయిస్తుంది. ఏపీ పర్యటనలో ఉన్న సీఈసీ రాజీవ్ కుమార్ ను కలిసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్ పలు సూచనలు చేశారు. కేంద్ర ఎన్నిక సంఘం ప్రతినిధులను కలిసిన తరువాత మీడియాతో మాట్లాడారు. అక్కడి వరకు బాగానే ఉంది. అక్కడి నుంచి నేరుగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. కే.ఏ.పాల్ సీఎం వైఎస్ జగన్ ను కలిసేందుకు క్యాంపు కార్యాలయానికి వెళ్లిన పాల్ ను అనుమతి లేదని క్యాంపు కార్యాలయంలోకి వెళ్లేందుకు అనుమతించలేదు పోలీసులు.

పోలీసులు అడ్డుకోవడంతో సీఎం క్యాంపు కార్యాలయం వెళ్లే రోడ్డు మెయిన్ గేట్ వద్ద వేచి చూస్తున్నారు. ఈ సందర్భంగా కే.ఏ.పాల్ మాట్లాడుతూ.. సీఎం వై.ఎస్. జగన్ ని కలిసేందుకు క్యాంపు కార్యాలయానికి వచ్చినట్టు తెలిపారు. ప్రజా సమస్యలపై సీఎంతో చర్చించి ఎన్నికల్లో కలిసి పని చేద్దామని చెప్పేందుకు వచ్చినట్టు వెల్లడించారు. అంతేకాదు.. సీఎం జగన్ అపాయింట్ మెంట్ ఈ రోజు అంతా వేచి చూస్తానన్నారు. అపాయింట్ మెంట్ ఇస్తే దీవిస్తా.. లేదంటే శపిస్తాను అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version