మాట వినకపోతే కాళ్ళు, పక్కటెముకలు విరిచేస్తాం: బిజెపి చీఫ్

-

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మద్దతుదారులకు బెంగాల్ బిజెపి చీఫ్ దిలీప్ ఘోష్ ఆదివారం వివాదాస్పద హెచ్చరికలు జారీ చేశారు. సక్రమమైన మార్గంలో వారు నడవాలని లేకపోతే మాత్రం వారి కాళ్ళు చేతులు విరిగిపోయే ప్రమాదం ఉందని, చచ్చిపోవచ్చు కూడా అని ఆయన హెచ్చరించారు. ఇబ్బందులు సృష్టిస్తున్న దీదీ సోదరులు రాబోయే ఆరు నెలల్లో వారి అలవాట్లను మార్చుకోవాలి అని ఆయన హెచ్చరించారు.Bengal becoming Mafia-ruled state like UP, Bihar: Dilip Ghosh on BJP leader  killing- The New Indian Express

లేకపోతే మీ చేతులు, కాలు, పక్కటెముకలు మరియు తల విరిగిపోతుంది అని ఆయన హెచ్చరించారు. మీరు ఆసుపత్రికి ఒక యాత్ర చేయవలసి ఉంటుందన్నారు. మీరు అంతకంటే ఎక్కువ చేస్తే, అప్పుడు మీరు శ్మశానవాటికకు వెళ్ళవలసి ఉంటుంది అని ఆయన హల్దియాలో జరిగిన ర్యాలీలో అన్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగాల్ పర్యటనకు రెండు రోజుల తరువాత దిలీప్ ఘోష్ వ్యాఖ్యలు చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news