ఓడిపోతే సిగ్గుపడాల.. రోజా సంచలన ట్వీట్

-

ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ-జనసేన-బీజేపీ కూటమి ఘనవిజయం సాధించగా వైసీపీ పార్టీ కేవలం 11 ఎమ్మెల్యే స్థానాలను మాత్రమే సొంతం చేసుకోగలిగింది. అయితే ఈ ఓటమిపై ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి, సినీ నటి ఎక్స్(ట్విట్టర్) వేదికగా స్పందించారు.

చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాల.. కానీ.. మంచి చేసి ఓడిపోయాం! గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం..ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం! అని రోజా ట్వీట్ చేశారు. ఇక, నగరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన రోజా ఈ ఎన్నికల్లో గాలి భాను ప్రకాశ్ రెడ్డి చేతిలో 45వేల భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. తరచూ చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లపై రోజా అనుచిత వ్యాఖ్యలు చేయడం కూడా ఓటమికి ఓ కారణమని ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news