పవన్ కళ్యాణ్ అంటేనే ఓ బ్రాండ్ : కిరణ్ రాయల్

-

పవన్ కల్యాణ్ అంటేనే బ్రాండ్ అంటూ తిరుపతి జనసేన ఇంఛార్జి కిరణ్ రాయల్ కామెంట్స్ చేశారు. తమ అధినేత డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కావడంపై జనసేన నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఆనాడు వైసీపీ పెద్దలు పవన్ కల్యాణ్ ను ఎమ్మెల్యే కానివ్వమని ఊకదంపుడు ఉపన్యాసాలు చేశారని.. ఇపుడు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, వారి అనుచరులు ఏమంటారు అని ఎద్దేవా చేశారు.

టీడీపీ కూటమి గెలిస్తే ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్నారని.. అయితే, 2019లో అవకతవకలతోనే వైసీపీ గెలిచిందా? అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో టీటీడీలో అడుగడుగునా అక్రమాలు, అవినీతి, దోపిడి జరిగిందని.. ఆడుదాం ఆంధ్రా అంటూ మాజీ మంత్రి రోజా కోట్ల రూపాయలు దోపిడి చేశారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news