మెగా హీరోతో రూ.28 కోట్లు పెట్టి సినిమా తీస్తే వచ్చిందెంతో తెలిస్తే షాక్..!

-

టాలీవుడ్ హీరో వైష్ణవి తేజ్, కేతిక శర్మ కలిసి నటించిన చిత్రం రంగ రంగ వైభవంగా.. ఈ చిత్రం ఇటీవల వినాయక చవితి పండుగ సందర్భంగా విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఊహించని విధంగా డిజాస్టర్ నిలిచింది. దీంతో హీరో వైష్ణవ తేజ్ వరుసగా రెండు ఫ్లాప్ లను చవిచూశారు. అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే.. వైష్ణవ తేజ్ మొదటి హీరోయిన్ కృత్తి శెట్టి కూడా వరుసగా రెండు ఫ్లాపులను చవి చూసింది.రంగ రంగ వైభవంగా సినిమా సక్సెస్ కాలేకపోయినప్పటికీ ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు మాత్రం ఈ సినిమా కోసం పెద్దగా ఖర్చుకాలేదేమో అని భావన కలుగుతోందట. ఎందుచేత అంటే ఈ సినిమా అంతా కూడా ఒకే ఇంట్లోనే షూటింగ్ చేసినట్లుగా తెలుస్తోంది. కేవలం మధ్య మధ్యలో కొన్ని సన్నివేశాలను మాత్రమే అవుట్డోర్లో షూటింగ్ చేసినట్లుగా కనిపిస్తోంది. అందుచేతనే ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం లేదని ప్రేక్షకులు సైతం అభిప్రాయంగా తెలియజేస్తున్నారు. ఒకవేళ ఈ సినిమాకు నిర్మాతకు లాస్ వచ్చిన పెద్దగా రాదని అందరూ భావిస్తున్నారు. కానీ ఇండస్ట్రీ వర్గాలలో మాత్రం ఈ సినిమా ప్రమోషన్స్ కి అంతా కలుపుకొని దాదాపుగా రూ.28 కోట్ల రూపాయల వరకు ఖర్చు వచ్చినట్లుగా సమాచారం.

అయితే నాన్ థియేట్రికల్ ఆదాయంగా రూ.21 కోట్ల రూపాయలు రాగ మిగిలిన రూ.7 కోట్లు థియేటర్స్ నుంచి రావాల్సి ఉన్నది. ఇక సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందాన్ని తిప్పడానికి రూ.25 లక్షల వరకు ఖర్చయినట్లుగా సమాచారం. ఇక మ్యూజిక్ డైరెక్టర్గా దేవిశ్రీప్రసాద్ తీసుకోవడంతో ఆయనకు కూడా ఎక్కువగా ఇవ్వాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా థియేటర్ నుంచి కేవలం రూ.2 కోట్ల రూపాయలను మాత్రమే వసూలు చేసిందట. మొత్తం మీద ఈ సినిమాకి రూ.5 కోట్ల రూపాయల వరకు నష్టం వచ్చిందని సమాచారం. అయితే ఈ సినిమా కొన్న బయ్యర్లకు మాత్రం నష్టాన్ని మిగిల్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version