మరిదితో అక్రమ సంబంధం… మూడో భర్త అనుమానించాడని బిడ్డనే చంపుకున్న దుర్మార్గపు తల్లి

-

మానవత్వం మంట కలిసి పోతోంది. క్షణకాలం సుఖం కోసం వావీ వరసలు మరిచి ప్రవర్తిస్తున్నారు కొంతమంది. తమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని భర్తలను, పిల్లలను అడ్డుతొలగించుకునేందుకు ఎంతకైానా తెగిస్తున్నారు. ఇదిలా ఉంటే తమిళనాడుకు చెందిన ఓ మహిళ. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు వివాహాలు చేసుకుని… మూడో భర్త అనుమానిస్తున్నాడని.. తన పాతివ్రత్యాన్ని నిరూపించుకునేందుకు సొంత బిడ్డనే కాల్చి చంపింది.

పూర్తి వివరాల్లోకి వెళితే చెన్నైలో ఆదివారం చోటు చేసుకున్న ఘటన సభ్య సమాజాన్ని విస్మయపరిచింది. తూత్తుకుడికి చెందిన పాల్‌ వణ్ణన్‌ కొన్నేళ్ల క్రితం భార్య జయలక్ష్మితో చెన్నైకు వచ్చాడు. వీరికి నిత్య అనే కుమార్తె ఉంది. కొన్నాళ్ల క్రితం భర్త, కుతురును విడిచి మరిది అయిన దురైరాజ్ తో కలిసి జయలక్ష్మీ ముంబై పారిపోయింది. అక్కడే కాపురం కూడా పెట్టారు. వీరికి పవిత్ర(10) అనే కుమార్తె కూడా ఉంది. అయితే ఏడేళ్ల క్రితం దురైరాజ్ చెప్పాపెట్టకుండా జయలక్ష్మీని విడిచి వెళ్లాడు. ఇప్పటికీ పత్తా లేకుండా పోయాడు. దీంతో జయలక్ష్మీ చెన్నైలోని తరువొత్తియూర్ కు మకాం మార్చింది. ఈ క్రమంలోనే ఓ లారీ డ్రైవర్ ని మూడో వివాహం చేసుకుంది.

మూడో భర్తతో కొన్నాళ్లు సంసారం సాఫీగానే సాగింది. వీరిద్దరిక భానుప్రియ(06), కుమారుడు భూపాలన్ (05) జన్మించారు. కాగా మూడో భర్త పద్మనాభన్ జయలక్ష్మీ పై తరుచు అనుమాన పడేవాడు. అయితే ఈ సమయంలోనే జయలక్ష్మీ రాక్షసిగా ప్రవర్తించింది. తన ఏ పాపం ఎరుగనని.. తను పతివ్రత అని నిరూపించుకునే క్రమంలో భర్త చెప్పిన విధంగా నిద్రిస్తున్న రెండో భర్తతో కలిగిన కూతురు పవిత్రపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. అయితే కాసేపటి తర్వాాత మంటల్లో కాలిపోతున్న కూతురును రక్షించే ప్రయత్నం చేసింది.

స్థానికులు బాధితురాలిని కీల్పాకం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పవిత్ర మరణించింది. అయితే ఈ కేసుపై ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేయగా… జయలక్ష్మీ మూడు పెళ్లిళ్ల బాగోతం బయటపడింది. పోలీసులు జయలక్ష్మీని, మూడో భర్త పద్మనాభన్ ను అరెస్ట్ చేశారు. దీంతో పిల్లలు అనాథలయ్యారు.

ప్రియుడి మోజులో భార్య… భర్తను క్రూరంగా చంపేసి, పాము కాటుగా కలరింగ్

Read more RELATED
Recommended to you

Latest news