ప్రియుడితో ఏకాంతం.. చివరికి మహిళ ప్రాణం తీసింది..!

-

సోషల్ మీడియా ద్వారా ఎన్నో అనర్థాలు జరిగిపోతున్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది ఓ వివాహిత తన ప్రియుడితో కలిసి ఏకాంతంగా ఉన్న వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఇక అటు తిరిగి ఇటు తిరిగి భర్త కంట పడ్డాయి. దీంతో భార్య తనను మోసం చేసిన విషయాన్ని జీర్ణించుకోలేక పోయిన భర్త కోపంతో రగిలిపోయిన చివరకు కట్టుకున్న భార్యను దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో వెలుగులోకి వచ్చింది.

భీవండి అన్సార్ నగర్కు చెందిన రఫీక్ మహమ్మద్ యూనస్ కు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇక లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయాడు.. దీంతో ఇంటి అద్దె కట్టలేక తన సోదరి నివాసానికి మకాం మార్చాడు. ఇక యూనస్ బార్యకు మరో యువకుడితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇటీవల ఏం జరిగిందో తెలియదు గానీ ప్రియుడితో నస్రిన్ ఏకాంతంగా ఉన్న వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా భర్త యూసఫ్ ఈ విషయం తెలుసుకొని తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యాడు. దారుణంగా హత్యచేశాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news