చంద్రబాబు అధ్యక్షతన కీలక సమావేశం..వారితో కీలక అంశాలపై చర్చ!

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం ఎన్టీఆర్ భవన్‌లో కీలక సమావేశం జరగనుంది.తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వ విజయాలు, సభ్యత్వ నమోదు సహా 8 అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

అదేవిధంగా టీడీపీ సభ్యత్వ నమోదు, పంచాయతీ రాజ్ వ్యవస్థ, పల్లె పండుగ, సూపర్ సిక్స్ పాలసీలపై సీఎం చంద్రబాబు ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే క్షేత్రస్థాయిలో ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో పార్లమెంట్ సభ్యులను అడిగి తెలుసుకోనున్నారు. అంతేకాకుండా గత ఎన్నికల టైంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారని టాక్ వినిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news