2024లో బిజెపి – జనసేన కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి – సోము వీర్రాజు

-

తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో నియోజకవర్గ బిజెపి కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2024లో బిజెపి – జనసేన కలిసి ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు. 2014లో మోడీ అధికారంలోకి వచ్చాక ఏపీలో విద్యుత్ కోతలు తగ్గాయన్నారు సోము వీర్రాజు.

మోడీ అంటేనే అభివృద్ధి అని, మోడీ అంటే అవినీతి రహిత వ్యక్తి అనీ కొనియాడారు. ఏపీలో చంద్రబాబు, జగన్ ప్రభుత్వాలు రెండూ కుటుంబ పాలన పార్టీలేనన్నారు సోము వీర్రాజు. ఏపీ అభివృద్ధి లేని అప్పుల రాష్ట్రం అని, అంతా అవినీతి మయం అంటూ ఆరోపించారు. ఎంఎల్సి ఎన్నికల్లో బిజెపి బలపరిచిన అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news