ఆస్ట్రేలియా ముందు భారీ లక్ష్యం, సిరీస్ ఇండియా సొంతం అవుతుందా ?

-

ఇండియా మరియు ఆస్ట్రేలియా ల మధ్య జరుగుతున్న 5 మ్యాచ్ ల టీ 20 సిరీస్ లో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్ లు పూర్తి కాగా , రెండింటిలోనూ ఆస్ట్రేలియా ఓటమి చెందింది. ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ లో ఇండియా గెలిస్తే సిరీస్ ఆస్ట్రేలియా కోల్పోతుంది. అందుకే ఎలాగైనా గెలవాలన్న కసితో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇండియా మొదట్లో రెండు వికెట్లు కోల్పోగా ఆ తర్వాత నెమ్మదిగా ఆడి ఇండియా ఆసీస్ ముందు చాలా కఠినమైన లక్ష్యాన్ని ఉంచింది. ఇండియా నిర్ణీత ఓవర్ లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. ఇప్పుడు ఆస్ట్రేలియా గెలవాలంటే 223 పరుగులు చేస్తేనే సిరీస్ లో నిలబడుతుంది.. లేదంటే వరల్డ్ కప్ గెలిచిన అనంతరం మొదటి సిరీస్ లోనే ఓటమి పాలవుతుంది.

అయితే ఆస్ట్రేలియాను అంత తక్కువ అంచనా వేస్తే కష్టమే… ఇండియా బౌలర్ లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయకపోతే గెలవడం కష్టమే. మరి ఏమి జరుగుతుందో తెలియాలంటే ఇంకాసేపు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news