IND VS SA:దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్… భారత్ తుది జట్టు ఇదే

-

మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో టీమిండియా సౌత్ ఆఫ్రికా ను ఓడించి సిరీస్ కైవసం చేసుకుంది. ఇప్పుడు వన్డే జట్టులో ఆడిన ఆటగాళ్లతోనే టెస్ట్ సిరీస్ కు సిద్ధమవుతోంది. ఇటీవల జరిగిన వన్డే ప్రపంచ కప్ తర్వాత టీమిండియా తొలిసారిగా పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగనుంది. కింగ్ కోహ్లీ, రోహిత్ శర్మ ,బూమ్రా వంటి తదితర కీలక ఆటగాళ్లు తొలి టెస్ట్ మ్యాచ్ కి సిద్ధం అవుతున్నారు. ఈనెల 26వ తేదీన సెంచూరియన్ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ భారత్ ప్లేయింగ్ ఎలెవన్ జట్టును ఎన్నుకున్నాడు. ఇందులో ఇద్దరు ఆల్రౌండర్లు ,ఆరుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ ,ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. కానీ గవాస్కర్ ఎన్నుకున్న జట్టులో ఓపెనర్ గా గిల్ కి స్థానం దక్కలేదు.

సునీల్ గవాస్కర్ ఎంపిక చేసిన జట్టు :

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, గిల్, విరాట్ కోహ్లి,శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా,రవిచంద్రన్ అశ్విన్, సిరాజ్, జస్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్),ముకేష్ కుమార్

 

సౌత్ ఆఫ్రికాతో టెస్టు సిరీస్కు టీమిండియా:

రోహిత్ శర్మ (కెప్టెన్), గిల్, జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జడేజా,మహ్మద్ సిరాజ్, జస్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ కృష్ణ, అభిమన్యు,ముకేష్ కుమార్,

Read more RELATED
Recommended to you

Latest news