కేక పెట్టించిన ఇండియా బౌలర్లు… 191 పరుగులకే పాకిస్తాన్ ఆల్ అవుట్… !

-

ఇండియా అభిమానులు అంతా కోరుకున్నట్లే ఈ రోజు వరల్డ్ కప్ లో జరుగుతున్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో రోహిత్ సేన అద్భుతమైన ఆటతీరును ప్రదర్శిస్తోంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇండియా పాకిస్తాన్ ను కేవలం 191 పరుగులకే కుప్పకూల్చి తమ సత్తా చాటింది. ఒక దశలో పాకిస్తాన్ చాలా మెరుగ్గా కేవలం రెండు వికెట్లు కోల్పోయి 155 పరుగులతో ఉండగా, అక్కడ నుండి పతనం ప్రారంభం అయింది. వరుసగా బాబర్ అజాం (50), సవుద్ షకీల్ (6), ఇఫ్తికార్ అహ్మద్ (4), రిజ్వాన్ (49), షాదాబ్ ఖాన్ (2), నవ్వాజ్ (4), హాసన్ అలీ (12) మరియు హరీష్ రాఫ్ (2) లు కేవలం పరుగులు మాత్రమే చేసి ఎనిమిది వికెట్లు కోల్పోయారు. ఇది నిజంగా చాలా వరెస్ట్ షో అని చెప్పాలి. బాబర్ మరియు రిజ్వాన్ లు మినహా ఎవ్వరూ ఆకట్టుకోలేక ఇండియా బౌలర్ల దెబ్బకు చేతులెత్తేశారు.

ఇండియా బౌలర్లలో బుమ్రా, సిరాజ్, కుల్దీప్, జడేజా మరియు హార్దిక్ లు తలో రెండు వికెట్లు తీసుకున్నారు. కుల్దీప్ మరియు సిరాజ్ లు కీలకమైన మలుపు వికెట్లను పడగొట్టి పాకిస్తాన్ ను ఒత్తిడికి గురయ్యేలా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news