WORLD CUP 2023: ఒత్తిడికి లోనయి పాకిస్తాన్ ఘోర వైఫల్యం … !

-

ఈ రోజు అహమ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం లో ఇండియా మరియు పాకిస్తాన్ ల దాయాదుల మధ్యన మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన పాకిస్తాన్ ఓపెనర్లు ఇమామ్ ఉల్ హాక్ మరియు అబ్దుల్ షఫీక్ లు నెమ్మదిగా ఆడి మొదటి వికెట్ కు 41 పరుగులు జోడించారు. మొదటి అబ్దుల్ షఫీక్ 20 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బాబర్ ఆజం తో కలిసి ఇమామ్ మరో 32 పరుగులు జోడించి అవుట్ అయ్యాడు. అప్పుడు జట్టు స్కోర్ పరుగులు ఉండగా 2 వికెట్లు మాత్రమే పడ్డాయి.. ఆ తర్వాత బాబా మరియు రిజ్వాన్ లు మరో వికెట్ ఇవ్వకుండా 82 పరుగులు జోడించారు.. కానీ మహమ్మద్ సిరాజ్ ఎంట్రీ ఇచ్చి బాబర్ అజాం (50) ను క్లీన్ బౌల్డ్ చేసి ఇండియా కు మంచి వికెట్ ఇచ్చాడు..

ఇక అక్కడితో మొదలు వరుసగా వచ్చిన వాళ్ళు వచ్చినట్లే పెవిలియన్ చేరి ఇన్నింగ్స్ ను అల్లకల్లోలం చేశారు. ముఖ్యంగా రిజ్వాన్ ఒత్తిడి ఫీలయ్యి అవుట్ అయ్యాడు.

Read more RELATED
Recommended to you

Latest news