ఇండియా కరోనా అప్డేట్ : 30 వేలు క్రాస్!

-

ఇండియా లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. మొన్నటి వరకు తగ్గిన కరోనా కేసులు ఇప్పుడు మళ్ళీ విజృంభిస్తున్నాయి. ఇక ఇవాళ కరోనా కేసులు కాస్త పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 31,923 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 3,01,604 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.06 శాతంగా ఉంది.

ఇక దేశంలో తాజాగా 282 మంది కరోనా తో మరణించగా మృతుల సంఖ్య 4,46,050 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 31,990 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,28,15,731 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 83,39,90,049 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 71,38,205 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ. ఇందులో కేరళ రాష్ట్రంలో 19,675 కేసులు నమోదు కాగా 142 మరణాలు సంభవించాయి.

Read more RELATED
Recommended to you

Latest news