ఇండియాలో శాంతించిన కరోనా..24 గంటల్లో 38,948 కేసులు

-

నిన్నటి కంటే దేశంలో ఇవాళ కరోనా కేసులు భారీగా తగ్గిపోయాయి. నిన్నటి రోజున 40 వేల కు పైగా కరోనా కేసులు నమోదు కాగా… గడిచిన 24 గంటల్లో దేశంలో 38,948 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,30,27,621 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 4,04,874 కు చేరింది.

ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.51 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 219 మంది కరోనా తో మరణించగా మృతుల సంఖ్య 4,40,752 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 43, 903 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశ వ్యాప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,21,81,995 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 68,75,41,762 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇది ఇలా ఉంటే భారత్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్త నడకన సాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news