ఇండియాలో భారీగా తగ్గిన కరోనా.. కొత్తగా 34,973 కేసులు

-

చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి మన ఇండియాను వదిలేలా లేదు. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇక ఇవాళ కరోనా కేసులు కాస్త తగ్గాయి. నిన్నటి రోజున పెరిగిన కరోనా కేసులు…ఇవాళ మాత్రం తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 34,973 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,31,74,954 కు చేరింది.

ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 3,90,646 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.69 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 338 మంది కరోనా తో మరణించగా మృతుల సంఖ్య 4,42,009 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 37,681 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,23,42,299 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 72,37,84,586 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news