ఏపీ కరోనా అప్డేట్ : కొత్తగా 1179 కేసులు

-

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి వదలేలా కనిపించడం లేదు. అటు ఏపీలోనూ కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఏపీ లో నిన్న తగ్గిన కరోనా కేసులు ఇవాళ మళ్లీ కాస్త పెరిగాయి. తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1179 కరోనా కేసులు నమోదయ్యాయి.

దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,40,708 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో 11 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14,089 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 13, 905 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 1651 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20,12 , 714 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 49, 737 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2, 78, 13, 498 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news