ఏపీ కరోనా అప్డేట్ : ఇవాళ కొత్తగా 1010 కేసులు నమోదు

-

ఏపీ లో కరోనా ఉధృతి తగ్గినట్లు కనిపిస్తోంది. ఏపీ లో నిన్న పెరిగిన కరోనా కేసులు ఇవాళ మళ్లీ తగ్గాయి. తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1010 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,50, 324 కి పెరిగింది.

ఇక గడిచిన 24 గంటల వ్యవధి లో మరో 13 మంది చని పోయారు. దీంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 176 కి చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 58 , 054 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2, 82 , 93 , 704 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 11,503 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 1149 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20,24 , 645 లక్షలకు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news