అరవై ఐదు లక్షలు దాటిన కరోనా కేసులు.. పరీక్షలే కట్టడి చేస్తున్నాయి !

-

భారత్ లో కరోనా కేసులు విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మొన్నటి దాకా కరోనా కేసులు తక్కువగానే నమోదయ్యాయి. కరోనా కేసులు భారీగా తగ్గాయని అనుకునే లోపే మళ్ళీ విజ్రుంభణ మొదలయింది. తాజాగా నమోదయిన కేసులతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 65 లక్షలు దాటింది. ఇక కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటలలో 75,829 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

corona

దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 65,49,374కు చేరింది. అలానే గడచిన 24 గంటలలో దేశంలో కరోనా వల్ల మొత్తం 940 మంది మృతి చెందారు. దీంతో కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,01,782కు చేరింది. ఇక దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న బాధితుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. నిన్న ఒక్క రోజే 11,42,131 పరీక్షలు చేశారు. దీంతో భారత్ లో ఇప్పటి దాకా చేసిన పరీక్షల సంఖ్యా 7,89,92,534కు చేరింది. పరీక్షలే కరోనా కట్టడికి ముఖ్య కారణంగా కనిపిస్తోందని కేంద్ర అభిప్రాయ పడుతోంది. ప్రతీ రోజు పది లక్షలకు పైగా కరోనా పరీక్షలను కేంద్రం చేస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news