దేశవ్యాప్తంగా తగ్గుతున్న కరోనా వైరస్‌ ఉధృతి.. 24 గంటల్లో ఎన్నంటే !

-

భారత్ లో కరోనా విజృంభణ నెమ్మదిగా తగ్గుతోందని భావిస్తూ వచ్చాం. ఎందుకంటే కొన్ని రోజుల పాటు కేసులు మరణాలు రెండూ తక్కువ నమోదు కావడంతో ఇక కరోనా ఎఫెక్ట్ తగ్గినట్టేనని భావించారు. కానీ మళ్ళీ నెమ్మదిగా కేసులు, మరణాలు కూడా పెరుగుతున్నాయి. అయితే మొన్న భారీగా తగ్గిన కేసులు మళ్ళీ నిన్న పెరిగాయి. తాజాగా ఈరోజు మళ్ళీ కేసులు తగ్గాయి. గడచిన 24 గంటలలో 38,310 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలానే గడచిన 24 గంటలలో దేశంలో కరోనా వల్ల మొత్తం 490 మంది మృతి చెందారు.


అలానే గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 58,323గా ఉంది. దేశంలో ఇప్పటి వరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 82,67,623 కాగా అందులో ఇప్పుడు దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 5,41,405గా ఉన్నాయి. ఇప్పటి దాకా కరోనాకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 76,03,121కి చేరింది. అలానే కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,23,097 కి చేరింది. ఇక దేశంలో నిన్న 10,46,247 కరోనా పరీక్షలు చేయగా ఇప్పటిదాకా 11,17,89,350 పరీక్షలు చేసినట్టు ఐసీఎంఆర్ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news