ఇండియాలో కరోనా మటాష్..ఇవాళ ఒక్కరోజు కేవలం 16 వేల కేసులే నమోదు

-

ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు విపరీతంగా తగ్గి పోయాయి. గత 20 రోజుల నుంచి కరోనా కేసులు విపరీతంగా పడిపోయాయి. ఇక కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 16051 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,28,38,524 కు చేరింది.

ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 2,02,131 కు చేరింది.ఇక దేశం లో కరోనా పా జిటివిటి రేటు 96.62 శాతం గా ఉంది. ఇక దేశంలో తాజాగా 206 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,12,109 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 37901 మంది కరోనా నుంచి కోలు కున్నారు.

ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,21,24,284 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,75,46,25,710 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 7,00,706 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news