ఇండియాలో కొత్తగా 2876 కరోనా కేసులు, 98 మరణాలు

-

మన దేశం లో కరోనా మహమ్మారి కేసులు క్రమ క్రమంగా తగ్గముఖం పడుతున్నాయి. మొన్నటి వరకు విపరీతంగా పెరిగిన కరోనా కేసులు.. ఇప్పుడు అమాంతం తగ్గి పోయాయి. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 2876 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,29,98,938 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 32,811 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 89. 11 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 98 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,16,072 కి చేరింది.

ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,80,60,93,107 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 18,92,143 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1106 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,24,50,055 కు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news