మెల్‌బోర్న్‌లో పాకిస్థాన్‌-ఇండియా T20 మ్యాచ్.. నిమిషాల్లో అమ్ముడైన టికెట్లు

-

వచ్చే నెలలో ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్​లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాక్​తో టీమ్​ఇండియా అక్టోబర్​ 23న తలపడనుంది. మెల్‌బోర్న్​ క్రికెట్​ గ్రౌండ్​లో జరగున్న ఈ మ్యాచ్​ షురూ కాకముందే ఓ సూపర్ రికార్డు క్రియేట్ చేసింది. అదేంటంటే.. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు క్షణాల్లో సేల్ అయిపోయాయి. స్టాండింగ్​ రూమ్​ టికెట్స్​ కూడా అమ్ముడుపోయినట్లు ఐసీసీ తెలిపింది.

అక్టోబర్‌ 16 నుంచి నవంబర్‌ 13 వరకు జరగనున్న ఈ మెగాటోర్నీకి ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఒక్క నెలలో జరగనున్న ఈ మ్యాచ్‌లన్నింటికి కలిపి దాదాపు 5 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు ఐసీసీ ప్రతినిధి ఒకరు ప్రకటించారు. 82 దేశాల నుంచి అభిమానులు ఈ టికెట్లు కొనుగోలు చేశారని.. ఈ టోర్నీలో 16 జట్లు పాల్గొననుండగా.. ఈసారి అన్ని స్టేడియాలు ఫుల్‌ అయ్యేలా కనిపిస్తుందంటూ పేర్కొన్నారు.

ఇక ఆస్ట్రేలియాలో అతిపెద్ద గ్రౌండ్‌ అయిన మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌(ఎంసీజీ) కెపాసిటీ 86,174 కాగా.. అన్ని సీట్లు ఫుల్‌ అయ్యాయని ఐసీసీ తెలిపింది. సేల్​ ప్రారంభమైన నిమిషాల్లోనే టికెట్లు అమ్ముడైపోవడం రికార్డు అని హర్షం వ్యక్తం చేసింది. త్వరలో మరోసారి టికెట్లు రిలీజ్​ చేస్తామని వెల్లడించింది

Read more RELATED
Recommended to you

Latest news