200వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ లో ఇండియా విజయం సాధిస్తుందా !

-

ఇండియా మరియు వెస్ట్ ఇండీస్ జట్ల మధ్య జరిగిన టెస్ట్ మరియు వన్ డే సిరీస్ లలో ఘనవిజయాన్ని సాధించిన ఇండియా ఇప్పుడు మూడవ టైటిల్ పైన గురి పెట్టింది. ఈ రోజు నుండి జరగనున్న అయిదు టీ 20 మ్యాచ్ ల సిరీస్ లో మొదటి మ్యాచ్ జరుగుతూ ఉంది. ఈ రోజు మ్యాచ్ కు ఒక ప్రత్యేకత ఉంది, టీ 20 అంతర్జాతీయ స్థాయిలో ఇండియాకు ఇది 200వ మ్యాచ్ కావడం విశేషం. ఇండియా కన్నా ముందు పాకిస్తాన్ 223 టీ 20 మ్యాచ్ లతో మొదటి స్థానంలో ఉంది. ఇక ఈ మ్యాచ్ ముందు వరకు 199 మ్యాచ్ లను మాత్రమే ఆడిన ఇండియా 127 మ్యాచ్ ల్లో గెలుపొందగా, 63 మ్యాచ్ లలో ఓడింది. కాగా ఈ రోజు జరగనున్న 200 మైలురాయి మ్యాచ్ లో ఇండియా గెలుపొంది రికార్డ్ సాధిస్తుందా అన్నది చూడాలి. ఛేజింగ్ చేయనున్న ఇండియా వెస్ట్ ఇండీస్ ను ఎంత స్కోర్ లోపు కట్టడి చేస్తుందో చూడాలి.

ఇక మొదటి వికెట్ ను చాహల్ తన స్పిన్ మాయాజాలంతో డేంజరస్ మేయర్స్ ను అవుట్ చేసి ఇండియాకు శుభారంభాన్ని అందించాడు.

Read more RELATED
Recommended to you

Latest news